- సీఎం,మంత్రి గంగుల కటౌట్ లకు పాలాభిషేకం
- రైతుల కోసం ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ సారూ…
- అన్నదాతకు మరోసారి అండగా తెలంగాణ ప్రభుత్వం
- తాజాగా సీఎం ప్రకటనతో రైతుల హర్షాతిరేకాలు..
- సీఎం కెసిఆర్, మంత్రి గంగుల చిత్రపటాలకు పాలాభిషేకాలు ..
- రుణపడి ఉంటామని కృతజ్ఞతలు..
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ కరీంనగర్ జిల్లాలోని దుర్షేడ్ గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు.

బుధవారం గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే ఉంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు..
