National News Networks

 హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Post top
  • నలుగురు స్పాట్ డెడ్
  • ఇద్దరి పరిస్థితి విషయం
  • మేడారం తల్లుల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన

హన్మకొండ:హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.

టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కాగా, తీవ్ర గాయాలపాలైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు స్తానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ వాసులు. మృతిచెందిన వారిలో అనుముల నరసింహ చారి, వెల్డండి సాంబరాజు, వెల్డెండి ఆకాంక్ష, వెల్దండి లక్ష్మి ప్రసన్న ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.